నింగి నుంచి సాగెనొక్క నీటితీగ నేరుగా
భంగమంచు నేదిలేక పల్లముండు వైపుగా
రంగు చిక్కనయ్యె నేల రమ్యమైన తోటయై,
పొంగులెత్తె సౌరభమ్ము పూల మించుచున్నదై.
- లక్ష్మీదేవి
ఉత్సాహము
పూలతీగెలు పైకి పాకుతాయి. కానీ ఇక్కడ నీటి తీగ స్వభావరీత్యా పల్లమున్న వైపుకు సాగి వచ్చింది. నేరుగా, ఏ ఆటంకమూ లేకుండా. తడిసిన రేగడినేలలు వివిధ రంగులు చిక్కగా పులుముకొని రంగు పువ్వులు పూసిన తోటలయినాయి. మట్టి పరిమళాలు పూల గంధాలను మించి పొంగులెత్తాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి